: డబ్బు మూటలు తీసుకుని చంద్రబాబు మీ దగ్గరకు వస్తారు: ఎన్నికల ప్రచారంలో జగన్

మూటలకు మూటలు డబ్బు తీసుకుని చంద్రబాబు మీ దగ్గరకు వస్తారంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఐదో రోజు రోడ్ షోలో భాగంగా జగన్ మాట్లాడుతూ, ‘ఈ మూడున్నరేళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును చంద్రబాబు తీసుకొస్తారు. తమ పార్టీకి ఓటు వేయమని చెబుతూ ఓటుకి రూ.5 వేలు ఇచ్చి, దేవుడు పటం చూపి వారితో ప్రమాణం చేయించుకుంటారు. ఏ దేవుడూ కూడా పాపానికి ఓటేయమని చెప్పడు. అలా చెప్పేది దెయ్యాలే. రూ.5 వేలు మీ చేతుల్లో పెట్టినప్పుడు దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటేయండి..ధర్మానికే ఓటెయ్యండి..న్యాయాన్ని గెలిపించండి. మీ ఓటుతో నేను వెంటనే ముఖ్యమంత్రిని కాకపోవచ్చు. కానీ, ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్రానికి ఈ ఎన్నికే నాంది. చంద్రబాబులా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్బుద్ధి, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపే ఛానెళ్లు, పేపర్లు నా దగ్గర లేవు’ అని జగన్ అన్నారు.

More Telugu News