balakrishna: బాలకృష్ణ మూవీలో నయనతార కాకుండా మరో ఇద్దరు కథానాయికలు?

పూరీ జగన్నాథ్ సినిమా 'పైసా వసూల్'కి ఇలా గుమ్మడికాయ కొట్టారో లేదో, అలా కె.ఎస్.రవికుమార్ తో కలిసి ఆ మరునాడే బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లారు. నిన్నటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాలకృష్ణ నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలకి .. కొంత ఎమోషన్ ను కూడా జోడించి ఈ కథను తెరకెక్కిస్తున్నారు.

 ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేశారు. ఆమె కాకుండా మరో ఇద్దరు కథానాయికలకు ఈ కథలో చోటు ఉందట. అందువలన మరో ఇద్దరు కథానాయికల కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ ఇద్దరినీ ఖరారు చేయనున్నారని అంటున్నారు. ఆ ఛాన్స్ ఎవరికి దక్కనుందో చూడాలి.  

More Telugu News