: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. బెంగళూరు చేతిలో చిత్తు.. రాహుల్ అరుదైన ఘనత!

ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. వరుసగా రెండోసారి ఓటమి పాలై అభిమానులను నిరాశ పరిచింది. ఆదివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-31 తేడాతో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో ఇరగదీసిన తెలుగు జట్టు తర్వాత ఆ ఊపును కొనసాగించడంలో విఫలమైంది. రెండో మ్యాచ్‌లో ఓడినా పోరాడిన జట్టు, ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో పోరాడకుండానే చేతులెత్తేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైంది.

ఇక కెప్టెన్ రాహుల్ చౌదరి కూడా అంచనాలను అందుకోలేకపోవడం జట్టు పరాజయానికి గల కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది. కాగా, ప్రొకబడ్డీలో రాహుల్ 500 రైడ్ పాయింట్లు అందుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌పై యుముంబా 29-28తో నెగ్గింది.

More Telugu News