: ‘నవ్యాంధ్రకు నవరత్నాలు’ పోస్టర్ ను ఆవిష్కరించిన వైసీపీ నేతలు

‘నవ్యాంధ్రకు నవరత్నాలు’ పోస్టర్ ను వైసీపీ నేతలు ఈ రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ అధినేత జగన్ ముందుకు వెళుతున్నారని, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలను తెలియజెప్పేందుకే ‘అన్నొస్తున్నాడు’ పేరిట త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారని చెప్పారు.

 తొమ్మిది హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 10నుంచి 25వ తేదీ వరకూ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అదేవిధంగా వైఎస్సార్ వర్థంతి సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 7 వరకూ ప్రతి ఇంటికీ నవ్యాంధ్ర నవరత్నాలు కరపత్రాలను పంపిణీ చేస్తామని చెప్పారు. 

More Telugu News