: పండంటి పాపకు జన్మనిచ్చిన గంభీర్ సతీమణి.. తమ జీవితంలో వెలుగులు నిండాయన్న గంభీర్!

ఇండియన్ క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ దంపతులకు పండంటి పాప జన్మించింది. ఇప్పటికే గంభీర్ కు ఆజీన్ అనే కూతురు ఉంది. ఇప్పుడు రెండో పాప జన్మించింది. ఈ సందర్భంగా గంభీర్ తన సంతోషాన్ని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. "మమ్మల్ని దీవించేందుకు మా కుటుంబంలోకి మరో యువరాణి అడుగుపెట్టింది. ఆమె రాకతో మా జీవితంలో వెలుగులు నిండాయి. యువరాణికి స్వాగతం", అంటూ గంభీర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అంతేకాదు, తన పెద్ద కుమార్తె ఒడిలో పడుకున్న చిన్నారి ఫొటోను అప్ లోడ్ చేశాడు. 2011లో నటాషాతో గంభీర్ వివాహం జరిగింది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు గంభీర్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

More Telugu News