: జియో ఎయిర్ టెల్ కు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్

ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ ల నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. డేటావినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తన ప్రీ పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త డేటా ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో 444 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ వినియోగదారులకు 90 రోజులపాటు 3జీ వేగంతో ప్రతి రోజూ 4 జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కారణంగా వినియోగదారులు రోజు వారీ డేటా ఒక జీబీ కోసం రూపాయి కంటే తక్కువ చెల్లిస్తాడని అన్నారు. ఇతర సంస్థలు రోజూ 2 జీబీ మాత్రమే అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ 4 జీబీ 3జీ డేటా అందించడం విశేషం. దీంతో డేటా ఆఫర్లలో ఇదే గరిష్ఠ ఆఫర్ అని బీఎస్ఎన్ఎస్ ప్రతినిధులు చెబుతున్నారు. 

More Telugu News