: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ- కాంగ్రెస్ పొత్తు

ఉత్తరప్రదేశ్‌లో వ‌చ్చేనెల‌ అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ ఈ సారి కాంగ్రెస్ తో ముందుకు వెళ్లాల‌ని చూస్తోంది. ఈ మేరకు ఆ రెండు పార్టీలు సీట్ల పంపకాలపై ఒప్పందం కుదుర్చుకునే దిశగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. ఈ క్రమంలో త‌మ‌త‌మ‌ పార్టీలకు గట్టి పట్టున్న సీట్లపై పట్టువిడుపుల ధోరణి కొనసాగించాలని ఆ రెండు పార్టీలు అంగీకారానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ చ‌ర్చ‌ల‌న్నీ మధ్యవర్తుల ద్వారా, టెలిఫోన్ చర్చల ద్వారా జరిగాయని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ అంశంపై ఇంకా స‌మావేశం కాలేదు. ఈ ఇరు పార్టీలలో యూపీలోని మ‌రిన్ని చిన్న పార్టీల‌ను కూడా త‌మ కూట‌మిలో చేర్చుకోనున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News