panner selvam: శాస‌న‌స‌భ‌ను స‌మావేశ‌ప‌ర్చండి.. బలనిరూపణకు సిద్ధపడండి: ప‌న్నీర్‌సెల్వంకి డీఎంకే సూచ‌న‌

జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టి పాలన కొనసాగిస్తున్నారు. అయితే, పన్నీరు సెల్వం శాసనసభలో బలనిరూపణకు సిద్ధపడాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్ చేసింది. శాసనసభను సమావేశపరచాల‌ని కూడా సూచించింది. మ‌రోవైపు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని ప‌లువురు అన్నాడీఎంకే నేత‌లు కోరుతున్న విష‌యం తెలిసిందే. ఆమె సీఎం అవుతార‌ని ఆ రాష్ట్ర‌ మంత్రులు కొందరి నుంచి సంకేతాలు రావ‌డం విశేషం. ఇప్పుడు డీఎంకే కూడా పన్నీర్ సెల్వం బ‌ల‌నిరూప‌ణ‌కు సిద్ధం కావాలని డిమాండ్‌ చేయటంతో మ‌రోసారి త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

More Telugu News