delhi: ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళా జేబుదొంగల జోరు.. 438 మంది పట్టుబడిన వైనం!

ఢిల్లీ మెట్రో రైళ్లలో దొంగ‌లు రెచ్చిపోతున్నారు. ప్ర‌యాణికుల‌ జేబులు కత్తిరించేస్తున్నారు. అయితే, ఈ చోరీల‌కు పాల్ప‌డుతూ పోలీసులకి పట్టుబడిన వారిలో 91 శాతం మంది మ‌హిళ‌లే వున్నారు‌. ఢిల్లీ మెట్రో స్టేష‌న్‌ల‌లో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌) పోలీసులు ఈ ఏడాది ప‌ట్టుకున్న జేబు దొంగ‌ల వివ‌రాల‌ను వెల్లడించారు. అయితే వారిలో 438 మంది మహిళలు ఉండ‌గా, పురుషులు 41 మంది మాత్ర‌మే ఉన్నారు.

కొన్నేళ్ల నుంచి జేబు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య  పెరుగుతూనే ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. ఈ మ‌హిళ‌లు ప్ర‌యాణికుల‌కి అనుమానం రాకుండా పిల్లవాడిని చంకలో పెట్టుకొని మ‌రీ ప్ర‌యాణికుల‌ జేబుల్లో చేతులు పెట్టేస్తున్నార‌ట‌. మ‌రికొంత మంది మ‌హిళ‌లు గుంపుగా వెళ్లి ప్రయాణికుల పర్సులు కొట్టేస్తున్నార‌ట‌. దొంగ‌ల‌ను పట్టుకోవడానికి సీఐఎస్‌ఎఫ్ పోలీసులు సాధారణ దుస్తుల్లో రైళ్లలోకి ప్ర‌వేశించి త‌నిఖీలు నిర్వ‌హించారు.

More Telugu News