demonitization: తమిళనాడులో భారీగా రూ.2000 నోట్లు స్వాధీనం

పెద్దనోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా అధికారులు జరుపుతున్న దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉద‌యం తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో పోలీసులు ఓ కారు నుంచి రూ.36 లక్షల విలువైన కొత్త రూ.2000 నోట్లను స్వాధీనం చేసుకుని ఆదాయ ప‌న్ను శాఖ అధికారులకు అప్ప‌గించారు. ఈ త‌నిఖీపై పోలీసులు మాట్లాడుతూ... ఓ కారు చెక్ పోస్ట్ వద్ద ఆగకుండా వెళ్లిపోయింద‌ని, దీంతో ఆ కారును వెంబ‌డించి ఎట్ట‌కేల‌కు దాన్ని అడ్డగించి ఆపామ‌ని తెలిపారు. అనంత‌రం ఆ కారులో సోదాలు చేయగా దానిలో ఈ కొత్త‌నోట్లు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని వారు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు.

More Telugu News