lorry accident: నిద్రిస్తున్న వారి పై నుంచి దూసుకెళ్లిన లారీ... ఇద్దరి మృతి

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెద‌పాడు మండ‌లం క‌ల‌ప‌ర్రులోని ఐబీపీ పెట్రోల్ బంకు వ‌ద్ద ఈ రోజు ఉద‌యం విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. నిద్రిస్తున్న‌వారిపై నుంచి లారీ దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. నిన్న రాత్రి ఇద్ద‌రు వ్య‌క్తులు స‌ద‌రు లారీ కింద నిద్రించారు. ఈ రోజు ఉద‌యం ఆ విష‌యాన్ని గ‌మ‌నించ‌ని లారీ డ్రైవ‌ర్ ఎప్ప‌టిలాగే లారీని స్టార్ట్ చేసి తీసుకెళ్ల‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మృతులు ఇద్ద‌రూ స్థానికంగా కూలీలుగా ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

More Telugu News