: తిరుమల వెంకన్న దరి చేరిన ‘గద్వాల’ జోడు పంచెలు!

తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నాయి. 9 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2న అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో తెలంగాణలోని గద్వాల సంస్థానం అందజేస్తున్న జోడు పంచెల్లోనే దర్శనమిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు కూడా వెంకన్నకు గద్వాల సంస్థానం జోడు పంచెలను అందజేసింది. గద్వాల సంస్థానాధీశులు శ్రీలతాభూపాల్ ఆదేశాలతో సంస్థానం ప్రతినిధి మహంకాళి కర్ణాకర్ నిన్న జోడు పంచెలను వెంకన్న ఆలయ బొక్కసం ఇన్ చార్జీ గురురాజకు అందజేశారు.

More Telugu News