: విజయనగరం జిల్లాలో పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు!

విజయనగరం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ఈరోజు బీభత్సం సృష్టించింది. పార్వతీపురం నుంచి సాకికి బయలుదేరిన బస్సు ప్రమాదం బారి నుంచి తప్పించుకోవడంతో దానిలోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని కురుపాం వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో అక్కడి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు.

More Telugu News