: నయీమ్ షెల్టర్ జోన్ గా ఒంగోలు!

ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. నయీమ్ షెల్టర్ జోన్లలో ఏపీలోని ఒంగోలు కూడా ఒకటని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్ కౌంటర్ కు కొద్ది రోజుల ముందు ఏకంగా వారంరోజుల పాటు నయీమ్ ఒంగోలులో మకాం వేసాడని తేలింది. నయీమ్ తన సమీప బంధువు సలీంను ఒంగోలులో వుంచి, అతని ఇంటినే స్థావరంగా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు లోని మంగమూరు రోడ్డు శివార్లలో ఉన్న ఒక అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసేందుకు ఈ సలీం మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించాడట. ఇతనిని అక్కడి వాళ్లెవ్వరూ అంతకుముందు ఎరుగరని స్థానికుల సమాచారం. తాను హైదరాబాద్ కు చెందిన వాడినని, వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చానని అతను చెప్పేవాడని పోలీసుల సమాచారం. నయీమ్ మృతదేహం వద్ద ఇతనిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News