: పోలీసులకు దొరికిన డైరీలో కలిఖో ఫుల్ వేదన!

ఈ ఉదయం ఆత్మహత్య చేసుకుని మరణించిన అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో ఫుల్ పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో దిగజారిన రాజకీయాలు, వాటితో తాను చెందిన మనస్తాపం గురించిన వివరాలను ఫుల్ తన డైరీలో రాసుకున్నట్టు తెలుస్తోంది. దీన్ని పూర్తిగా పరిశీలిస్తే, ఆయన మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఫుల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ఆయనకు అధికార నివాసాన్ని కేటాయించగా, రాజీనామా చేసిన తరువాత కూడా ఇంకా దాన్ని ఖాళీ చేయలేదు. పెమా ఖండూ ప్రభుత్వం ఏర్పడిన తరవాత, ఇంటిని ఖాళీ చేయాలని ఫుల్ కు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. తనతో కలసి నడిచి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వారంతా, తిరిగి వెళ్లిపోవడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది.

More Telugu News