: 'మేము సైతం' కోసం... ఎంజీబీఎస్ లో మూటలు మోసిన మంచు మనోజ్

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కూలీ అవతారమెత్తాడు. తన సోదరి నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమంలో భాగమయ్యేందుకు మనోజ్ కూలీగా మారాడు. ఆర్థికంగా ఓ కుటుంబాన్ని ఆదుకునేందుకు మనోజ్ హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లో కూలీగా పని చేశాడు. ఈ సందర్భంగా మూటలు మోశాడు. మనోజ్ ను కూలీగా చూసిన అభిమానులు తొలుత ఆశ్చర్యానికి గురైనా, తరువాత అతని సదుద్దేశాన్ని గమనించి, అతనికి సహకరించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. సుమారు నాలుగు గంటలపాటు మనోజ్ ఇలా వివిధ పనులు చేయడం విశేషం.

More Telugu News