: ముష్కర మూకలోని వారంతా బంగ్లాదేశ్ వారు, పాత నేరస్తులే!

ఢాకాలోని ఓ రెస్టారెంటుపై దాడి చేసి మారణహోమానికి పాల్పడిన దుండగులంతా బంగ్లాదేశ్ పౌరులేనని, వీరిలో ఐదుగురి కోసం పోలీసులు వెతుకుతున్నారని బంగ్లాదేశ్ ఐజీ షహీదుల్ హక్ వెల్లడించారు. వీరికి అల్ ఖైదా లేదా ఐఎస్ఐఎస్ తో ప్రత్యక్ష సంబంధాలు లేవని, దేశంలోని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిద్దీన్ తో సంబంధాలున్న వారని తెలిపారు. అటు ఐఎస్ఐఎస్ తో పాటు ఇటు అల్ ఖైదా సైతం తామే ఈ దాడి జరిపినట్టు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. దాడి తరువాత పోలీసు ఎన్ కౌంటర్ కొనసాగుతుండగా, కేఫ్ లో తీసిన కొన్ని చిత్రాలు ఐఎస్ఐఎస్ అనుబంధ వెబ్ సైట్లలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారే ఈ దాడికి పాల్పడి వుంటారని తొలుత భావించారు. ఇక ఎన్ కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల గుర్తింపు పూర్తయిన తరువాత వారంతా స్వదేశీ తీవ్రవాదులేనని తేలింది.

More Telugu News