: వనౌతులో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7గా తీవ్రత
పసిఫిక్ మహాసముద్రంలోని వనౌతు ద్వీపదేశంలో ఈరోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం ఆ దేశ రాజధాని పోర్ట్ విల్లాకు 208 కి.మీ. దూరంలోని నర్సప్ వద్ద ఉందని వెల్లడించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.