: రెండు వికెట్లు కోల్పోయిన ముంబయి ఇండియన్స్

తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి 31 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు రెండు వికెట్లు చేజార్చుకుంది. రోహిత్ శర్మ(7), హార్దిక్ పాండ్యా(2) ల వికెట్లను కులకర్ణి తీసుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్ లో పార్థివ్ పటేల్ , బట్లర్ కొనసాగుతున్నారు. ఐపీఎల్-9 లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

More Telugu News