: రెండు వారాల్లో డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్ మెంట్లు ఇస్తాం: మంత్రి గంటా

ఏపీలో రెండు వారాల్లోగా డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్ మెంట్లు ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 1424 పాఠశాలలకు రేషనలైజేషన్ వర్తింపజేస్తామని విజయవాడలో చెప్పారు. ఉపాధ్యాయులకు ఏకీకృత నిబంధనలపై కమిటీ చర్చించిందనీ, డిటెన్షన్ విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. 8, 9 తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పదో తరగతిలో వెయిటేజీ ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి లీగల్ నోటీసు ఇస్తామని గంటా పేర్కొన్నారు.

More Telugu News