: ప్రశాంతంగా బీహార్ తొలి దశ ఎన్నిక... 2 గంటల వరకు 43.42 శాతం పోలింగ్

బీహార్ రాష్ట్ర తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 49 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 43.42 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆర్ లక్ష్మణన్ మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నట్టు తమకు సమాచారం లేదన్నారు.

More Telugu News