: మానవ మూత్రం ఇక ఎంతమాత్రం వేస్ట్ కాదు!

బ్రిటీష్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించారు. తక్కువ వ్యయమయ్యే కొత్త విద్యుత్ జనరేటర్ కు రూపకల్పన చేశారు. ఈ జనరేటర్ కు ఇంధనం ఏమిటో తెలుసా?... మానవమూత్రం! అవును, మనిషి మూత్రం ద్వారా ఈ జనరేటర్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చంటున్నారు పరిశోధకులు. వెస్ట్ ఇంగ్లండ్ యూనివర్శిటీ, ఆక్స్ ఫామ్ సంస్థ సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి. జనరేటర్ లోని మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్ లో ఇంధనంగా నింపడానికి వర్శిటీ విద్యార్థులు, సిబ్బంది తదితరుల నుంచి మూత్రం సేకరించారు. ఈ పరిశోధనల్లో విజయం సాధించిన బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది చవకైనదని, ఒక్క మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్ ఖరీదు ఒక పౌండ్ (రూ.94) మాత్రమే అని లీరో పౌలోస్ అనే పరిశోధకుడు తెలిపారు. పర్యావరణం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు.

More Telugu News