విజయాలను ఇచ్చే పాతాళ వినాయకుడు

విజయాలను ఇచ్చే పాతాళ వినాయకుడు

తొలిపూజలు అందుకునే వినాయకుడు స్వయంభువు మూర్తిగా అనేక క్షేత్రాల్లో ఆవిర్భవించాడు. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా 'శ్రీకాళహస్తి' కనిపిస్తుంది. పంచభూత క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో 'పాతాళ వినాయకుడు' కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ స్వామిని గురించి ధూర్జటి 'శ్రీ కాళహస్తి మహాత్మ్యం'లోను .. శ్రీనాథుడి 'హరవిలాసం'లోను ప్రస్తావన వుంది. నలభై అడుగుల లోతులో స్వామివారు కొలువై ఉండటం వెనుక, ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం అగస్త్యుడు ఈ క్షేత్రంలో జీవనదిని ప్రవహింపజేయాలనే ఉద్దేశంతో పరమశివుడిని ప్రార్ధించాడు. స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు లేవు. వినాయకుడిని ప్రార్ధించకుండా ఈ కార్యానికి పూనుకోవడమే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు, ఆ స్వామిని ప్రార్ధించాడు. పాతాళ మార్గంలో అక్కడికి చేరుకున్న వినాయకుడు ఆ మహర్షి కోరికను నెరవేర్చాడు. అగస్త్యుడి కోరిక మేరకు ఆయనకి దర్శనమిచ్చిన చోటునే వెలిశాడు. ఇక్కడి వినాయకుడిని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి విజయాలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles