రుద్రాక్ష మాల విశిష్టత

రుద్రాక్ష మాల సాక్షాత్తు శివ స్వరూపమనీ .. అత్యంత శక్తిమంతమైనదని .. పరమ పవిత్రమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రుద్రాక్ష మాలను ధరించి చేసే శివపూజ వలన విశేషమైన ఫలితం ఉంటుందనేది మహర్షుల మాట. అందువలన చాలామంది శివభక్తులు మెడలో తప్పకుండా రుద్రాక్ష మాలను ధరిస్తూవుంటారు.

 రుద్రాక్షమాలతో చేసే జపం వలన పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. రుద్రాక్షమాలను ధరించి చేసే శివారాధన వలన, ఆ స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. రుద్రాక్ష మాలను ధరించడం వలన సమస్త దోషాలు .. పాపాలు నశించిపోతాయి. రుద్రాక్షమాలను ధరించినవారిని దుష్ట శక్తులు దరిచేరవు. అలానే అనారోగ్యాలు .. అపమృత్యు దోషాలు కూడా దరిచేరవు. రుద్రాక్ష మాలను ధరించినప్పుడు ఎంతో పవిత్రంగా వుండవలసి ఉంటుంది. నియమ నిష్టలు పాటిస్తూ రుద్రాక్ష మాల పవిత్రతను కాపాడుతూ వుంటే , ధరించిన వారిని అది అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది. 


More Bhakti News