భీముని కొలను వెనుక కథ

పూర్వకాలంలో 'శ్రీ పర్వతం'గా పిలవబడిన శ్రీశైలం .. సిద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పర్వతాల్లో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయనేది ప్రాచీన గ్రంధాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో 'భీముని కొలను' దర్శనమిస్తుంది. కొండరాళ్ల సందుల గుండా నీటి ప్రవాహం పరుగులుతీస్తూ కొలనుగా ఏర్పడింది. ఈ కొలనుకు ఈ పేరు రావడం వెనుక ఒక  కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం 'లోమశ మహర్షి'తో కలిసి పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట. ఆ పరిసరాలు చూసివచ్చిన భీముడు .. ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. దాంతో లోమశ మహర్షి ఒక శిలను చూపించి దానిని పగులగొట్టమని చెప్పాడు. తన 'గద'తో ఆ శిలను భీముడు పగులగొట్టగానే నీటి ధారలు కిందికి దూకాయి. ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుంది. భీముడి కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి 'భీముని కొలను' అనే పేరు వచ్చింది. ఇక్కడే భీముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు .. అందువల్లనే ఇక్కడి శివలింగం  .. 'భీమలింగం'గా నేటికీ పూజలు అందుకుంటోంది.            


More Bhakti News