శివానుగ్రహాన్ని కలిగించే పూలు ఇవే

పరమశివుడు వెన్నవంటి మనసున్నవాడు .. తల్లిలాంటి ప్రేమున్నవాడు. అంకితభావంతో స్వామిని సేవించాలే గానీ, ఆయన వరుసబెట్టి వరాలను అనుగ్రహిస్తాడు. ఆ దేవదేవుడిని ప్రీతికరమైన పూలతో అర్చించడం వలన, ఆయన అనుగ్రహం మరింత త్వరగా కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఒక్కో రకమైన పూలతో పరమశివుడిని సేవించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది.

ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన కలిగే ఫలితం మరిన్ని రెట్లు ఉంటుంది. మల్లెపూలు .. జాజి పూలు .. ఉమ్మెత్త పూలు .. మందారాలు ..  అవిసెపూలు .. వావిలి పూలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. ఉమ్మెత్తలతో పూజించడం వలన సంతాన భాగ్యం .. జాజిపూలతో అర్చించడం వలన వాహన యోగం కలుగుతుంది. మందారాలతో పూజించడం వలన శత్రు నాశనం .. వావిలిపూలతో ఆరాధించడం వలన పాపాల నాశనం జరుగుతుంది. సదాశివుడితో స్నేహాన్ని కోరుకునేవారు అవిసె పూలతో పూజించాలి. తుమ్మిపూలతో అర్చించడం వలన మోక్షం కలుగుతుందనేది ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తోంది.      


More Bhakti News