మణికంఠస్వామి దర్శనం

మణికంఠస్వామి దర్శనం

మణికంఠస్వామి దర్శనం
అయ్యప్పస్వామి లీలా విశేషాలు అనేకం. అందుకే భక్తులు ఆయన దీక్షను తీసుకోవడం .. శబరిమలకు వెళ్లి జ్యోతి దర్శనం చేసుకోవడం చేస్తుంటారు. ఇక ఇలా ప్రతి గ్రామం నుంచి ఆయన దర్శనం కోసం వెళ్లే భక్తులు, ఆ స్వామి భజనలు చేసుకోవడానికి .. అభిషేకాదులు జరిపించుకోవడానికి గాను ఆయన ఆలయాన్ని నిర్మించుకుంటున్నారు. సామూహికంగా ఆ స్వామిని సేవిస్తూ తరిస్తున్నారు.

అలా భక్తులంతా కలిసి నిర్మించుకున్న అయ్యప్పస్వామి ఆలయాలలో ఒకటి 'గరిడేపల్లి'లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లాలోని ఓ మండల కేంద్రంగా ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ ఊళ్లో చాలాకాలం నుంచి రామాలయం ఉంది .. ఆ తరువాత ప్రాచీనకాలం నాటి శివలింగం ఒకటి బయటపడగా, ఆ శివలింగానికి కూడా ఆలయాన్ని కట్టించారు.

అలా శివకేశవుల ఆలయాలు అలరారుతుండగా, ఇటీవలే అయ్యప్పస్వామి ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తూ ఉంటుంది. స్వామి దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అయ్యప్పస్వామి ఆరాధన అన్ని శుభాలను కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

More Bhakti Articles