Chiranjeevi: సోనూసూద్ తో కుస్తీ పడుతున్న చరణ్!

  • చివరి షెడ్యూల్లో 'ఆచార్య'
  • విలన్ గా సోనూసూద్
  • హైలైట్ గా యాక్షన్ ఎపిసోడ్స్
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు
Acharya movie shooting update

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ 'ఆచార్య' సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. కరోనా కారణంగా కొన్ని రోజుల క్రితం ఆగిపోయిన షూటింగు రీసెంట్ గా మొదలైంది.

చిరంజీవి .. చరణ్ ... సోనూసూద్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చరణ్ - సోనూసూద్ పై 'కుస్తీ పోటీ'కి సంబంధించిన ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. సినిమాలో ఒకానొక కీలకమైన సందర్భంలో వచ్చే ఈ ఎపిసోడ్ ను కొరటాల చాలా కొత్తగా డిజైన్ చేశాడనీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో 'సిద్ధా' అనే పవర్ఫుల్ నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ప్రతినాయకుడి పాత్రలో సోనూ సూద్ నటిస్తున్నాడు. సోనూసూద్ కెరియర్లోనే ఈ పాత్ర ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఇక చరణ్ .. మరికొంతమంది ఫైటర్లపై చిత్రీకరించిన రెయిన్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే టాక్ ఆల్రెడీ బయటికి వచ్చింది. చిరంజీవి సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. ఈ నెలాఖరుకు షూటింగు పార్టును పూర్తిచేసుకుని, దసరాకి విడుదల కానుందని అంటున్నారు.

More Telugu News