mahesh: 'స్పైడర్' విషయంలో మహేశ్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్!

'స్పైడర్' సినిమా కోసం మహేశ్ బాబు అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సినిమాను రూపొందించారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు మహేశ్ మరింత చేరువ కానున్నాడు. అయితే ఈ సినిమాలో తమిళ నటీనటులు ఎక్కువగా ఉండటమే మహేశ్ అభిమానులకు కాస్త ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.

 ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎస్.జె. సూర్య .. మరో విలన్ భరత్ తమిళ ఆర్టిస్టులే. ఇక రకుల్ తల్లి పాత్రలోను .. మరో ముఖ్యమైన పాత్రలోను కనిపించేది తమిళులే. అక్కడి ఆడియన్స్ కి ఈ సినిమాను ఎక్కించడానికి ఎక్కువమంది తమిళులని పెట్టడం, తెలుగు ఆడియన్స్ ను కాస్త అసహనానికి గురిచేస్తుందేమోననే ఆందోళనకి అభిమానులు గురవుతున్నారు. అలాంటి ఇబ్బంది తలెత్తకుండా మురుగదాస్ ఏం చేశాడో చూడాలి.    

More Telugu News