balakrishna: రిలీజ్ డేట్ మార్చుకున్న 'పైసా వసూల్'?

బాలకృష్ణ .. పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో 'పైసా వసూల్' చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. షూటింగ్ తొలి రోజునే ఈ డేట్ ను ఎనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ తేదీ మారనుందనేది తాజా సమాచారం.

 సెప్టెంబర్ 29 నుంచి ముందుకు జరిపి ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దసరాకి ఎన్టీఆర్ 'జై లవ కుశ' ..  మహేశ్ బాబు 'స్పైడర్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సమయంలో వస్తే తగినన్ని థియేటర్లు దొరకవు .. అంతే కాకుండా వసూళ్లపై కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అందువలన 'పైసా వసూల్' ముందుగానే రానున్నట్టు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది.      

More Telugu News