nagarjuna: 'రాజుగారి గది 2' రిలీజ్ డేట్ ఖరారైపోయింది!

నాగార్జున ప్రధాన పాత్రధారిగా ఓంకార్ దర్శకత్వంలో 'రాజుగారి గది 2' చిత్రం రూపొందింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రీ షూట్స్ వలన .. గ్రాఫిక్స్ నిడివిని పెంచాలనుకోవడం వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది.

 ముందుగా ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారుగానీ ..  పై కారణాల వలన కుదరలేదు. సెప్టెంబర్ మాసమంతా భారీ సినిమాలు రంగంలోకి దిగుతుండటం వలన, ఈ సినిమాను అక్టోబర్ 12న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో శీరత్ కపూర్ ముఖ్యమైన పాత్రను పోషించగా .. 'ఆత్మ'గా సమంతా కనిపించనుందని టాక్. ఈ సీక్వెల్ తో ఓంకార్ ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.   

More Telugu News