: సిద్ధిపేట జిల్లాలో భార్యను చంపిన భర్త!
కోటి ఆశలతో మెట్టింట్లో అడుగుపెట్టిన ఓ యువతి నాలుగు నెలలు కాకముందే భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. భార్యను చంపేసిన సదరు కసాయి భర్త పరారీలో ఉన్నాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా, అక్కన్నపేట మండలం రేగొండలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీస్తున్నారు. రఘు అనే వ్యక్తి తన భార్యను గొంతు కోసి ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. రఘు కోసం గాలింపు చర్యలు మొదలుపెడతామని చెప్పారు. ఈ దారుణానికి అతను ఎందుకు పాల్పడాడ్డన్న విషయంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.