: ఏపీలో రెచ్చిపోతున్న నాలుగు బీహార్ గ్యాంగులు

ఆంధ్రప్రదేశ్ లోకి నాలుగు బీహార్ గ్యాంగులు ప్రవేశించాయని పోలీసు అధికారులు వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమల్లో ఈ గ్యాంగుల ఆగడాలు పెరిగిపోయాయని చెప్పారు. ఈ గ్యాంగులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని... త్వరలోనే వీరి ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు. విజయవాడలో నగల దోపిడీకి పాల్పడిన దుండగులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సంపాదించామని చెప్పారు. మరోవైపు పోలీసుల అదుపులో ఇద్దరు దుండగులు ఉన్నట్టు తెలుస్తోంది.  

More Telugu News