: బ్రాహ్మణ కార్పొరేషన్ కొత్త చైర్మన్ గా వేమూరి ఆనంద సూర్య నియామకం

ఏపీబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా ఐవైఆర్ కృష్ణారావు స్థానంలో వేమూరి ఆనందసూర్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డి.సాంబశివరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీడీపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడిగా ఆనందసూర్య ఉన్నారు. ఆనందసూర్య స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పని చేసిన ఆయన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రాహ్మణుల సమస్యలపై పోరాడారు. 

More Telugu News