: తెలంగాణలో 8 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. మహిళా విభాగం అధ్యక్షురాలిగా గుండు సుధారాణి

తెలంగాణ రాష్ట్రంలో 8 కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ ఛైర్మన్లను నియమించారు. వాటి వివరాలు ఇవే...

  • హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ - మడుపు భూంరెడ్డి (మెదక్ జిల్లా)
  • గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ - గాంధీ నాయక్ (వరంగల్ జిల్లా)
  • తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ - మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి
  • ఉమెన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ - మాజీ ఎంపీ గుండు సుధారాణి
  • ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ - పుష్కర్ రామ్మోహన్ రావు (ఆదిలాబాద్ జిల్లా)
  • వికలాంగుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ - కె.వాసుదేవరెడ్డి
  • టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఛైర్మన్ - డాక్టర్ చిరుమిల్ల రాకేష్ కుమార్
  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ - మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్
దీనికి తోడు టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ గుండు సుధారాణిని నియమించారు. తెలంగాణ విద్యార్థి సమితి అధ్యక్షుడిగా ఓయూ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ ను ఖరారు చేశారు.

More Telugu News