: చంద్రబాబును కావాలనే అప్రదిష్టపాలు చేస్తున్నారు: వైసీపీపై మంత్రి జవహర్ ఫైర్

రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రదిష్టపాలు చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మంత్రి జవహర్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కంపెనీలన్నీ ఏపీకి వస్తే తమకు పుట్టగతులు ఉండవనే భయంతోనే... చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News