: అమెరికాలో మరో విద్వేష కాల్పులు...నల్ల జాతీయులే లక్ష్యం

అమెరికాలో మరోసారి జాతి విద్వేష కాల్పులు చోటుచేసుకున్నాయి. మొన్న ఉదయం భారతీయుడు లక్ష్యంగా జరిగిన కాల్పుల కలకలం చల్లారకముందే...శాన్‌ డియాగోలో నల్లజాతీయులే లక్ష్యంగా జాతి విద్వేష కాల్పులు జరిగాయి. పుట్టిన రోజు వేడుకల్లో పాలు పంచుకునేందుకు వచ్చిన శ్వేతజాతీయుడు పీటర్ సెలీస్ (47) వేడుక మధ్యలో...బీరు తాగుతూ...తన జేబులో దాచుకున్న తుపాకీ తీసి వేడుక జరుపుకుంటున్న నల్లజాతీయుడిని కాల్చి చంపాడు.

అనంతరం ఆ వేడుకలో పాల్గొన్న ఇతర నల్లజాతీయులపై కూడా కాల్పులు జరిపాడు. దీంతో ఆ వేడుకల్లో పాల్గొంటున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సెలీస్ కు నేరచరిత్ర ఉందని వారు వెల్లడించారు. ఇది కచ్చితంగా జాతి విద్వేష దాడేనని పోలీసులు స్పష్టం చేశారు. 

More Telugu News