: మండలిలోనే తేలనున్న ‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్ భవితవ్యం!

ఏపీ పెద్దల సభను కించపరుస్తూ కార్టూన్ వేసిన వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకుడు రవికిరణ్‌ వ్యవహారాన్ని మండలిలోనే తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రవికిరణ్‌పై కేసు పెట్టి కోర్టులో విచారించే కంటే చట్ట సభలకు ఉన్న విస్తృత అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడేలా చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆయనను మండలికి పిలిపించనున్నారు.

పొలిటికల్ పంచ్ పేరుతో మండలిపై ఆయన వేసిన అసభ్య కార్టూన్ వ్యవహారాన్ని చట్ట సభలకు నివేదించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రవికిరణ్ కార్టూన్ పెద్దల సభ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని న్యాయనిపుణులు సైతం చెబుతున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు నివేదికను మూడు రోజుల్లో శాసనసభ కార్యదర్శికి ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయించింది.

More Telugu News