: తిరుమలలో భారీ వర్షం..శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు!

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కొంచెం సేపటి క్రితం భారీ వర్షం కురిసింది. దీంతో, తిరుమల శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. ఈ నీటిని బయటకు పంపేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది యత్నిస్తున్నారు. ఎండలు మండుతున్న తరుణంలో వర్షం కురవడంతో భక్తులకు కాస్త ఉపశమనం లభించినట్టయింది. కాగా, రెండు రోజుల క్రితం తిరుమలలో భారీ వర్షం సహా ఈదురుగాలులు వీచాయి.

More Telugu News