: రాజాసింగ్! చేతనైతే అడ్డుకో...బయపడేవారు లేరు: సీపీఎం రాఘవులు సవాల్

కేరళ సీఎం పినరయి విజయ్ ను అడ్డుకుంటామని హెచ్చరించిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సీపీఎం రాఘవులు సవాల్ విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజాసింగ్ కు చేతనైతే పినరయి విజయ్ ను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో కేరళ సీఎం పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ ఎలాంటి మత విద్వేష ఘర్షణలు జరిగినా దాని వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉంటున్నాయని ఆయన చెప్పారు. దేశంలో అరాచకానికి కారణం ఆ సంస్థలేనని ఆయన స్పష్టం చేశారు. రాజాసింగ్ బెదిరింపులకు భయపడేవారు లేరని ఆయన తెలిపారు. బెదిరింపులతో అడ్డుకోవాలని చూస్తే భయపడతారని భావించడం సరికాదని ఆయన హితవు పలికారు. కాగా, కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలకు నిరసనగా పినరయి విజయ్ ను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News