: రోజాను ఎవరూ అడ్డుకోలేదు... అసెంబ్లీ లోపలికి వైకాపా మహిళా నేత

మీడియా, రాజకీయ నిపుణులు ఊహించినట్టుగా వైకాపా ఎమ్మెల్యే రోజాను, అసెంబ్లీలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేదు. ఈ ఉదయం నవ్యాంధ్ర నూతన అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభం కాగా, సమావేశాల్లో పాల్గొనేందుకు వైకాపా సభ్యులతో పాటు వచ్చిన మహిళా నేత రోజా, ముందుగా వైకాపా కార్యాలయంలోకి, ఆపై అందరితో కలసి అసెంబ్లీలోకి వెళ్లారు. ఆమెను ఏ అధికారి కూడా అడ్డుకోలేదు. కాగా, ఆమెపై విధించిన నిషేధం పూర్తి కావడం, తాజా ఆరోపణలపై హక్కుల కమిటీ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడంతోనే రోజాను ఎవరూ అడ్డగించలేదని తెలుస్తోంది.

More Telugu News