venkaiah naidu: కొంతమంది రెచ్చ‌గొట్టేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు: వెంక‌య్య నాయుడు ఆగ్రహం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చిన రైతుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు కేంద్రమంత్రి వెంక‌య్య నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... కొంత మంది రెచ్చ‌గొట్టేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారని, ప్ర‌జ‌లు వారిప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధిలో అంద‌రూ భాగ‌స్వాములు కావాలని, కొంత‌మంది అభివృద్ధిని అడ్డుకునే ప్ర‌యత్నం చేస్తున్నారని వెంక‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గురించి ఎవ్వ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దని ఆయ‌న అన్నారు. విభ‌జ‌న‌ను మ‌ళ్లీ వెన‌క్కి ర‌ప్పించ‌గ‌ల‌మా? అని ప్ర‌శ్నించిన వెంక‌య్య నాయుడు... అలా ఎవ‌రైనా చెబితే న‌మ్మ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. విభ‌జ‌న కూడా మంచిదేన‌ని, ఏపీని అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News