: ఆంధ్రులు కేంద్ర నాయకులకు బానిసలు కారు!: పవన్ కల్యాణ్ ఏకవాక్య విమర్శ

ఆంధ్రా ప్రజలు బానిసలేమీ కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. "ఆంధ్రులు.. ఈ దేశ ప్రజలు.. కేంద్రంలో ఉండే నాయకులకి, పార్టీలకి బానిసలు కారు..." అంటూ ఏకవాక్య విమర్శ చేశారు. 40 నిమిషాల క్రితం పవన్ ఈ పోస్టు పెట్టగా, ఇప్పటికే వేల సంఖ్యలో రీట్వీట్లను తెచ్చుకుంది. కాగా, నాయకులు పని చేయకపోబట్టే యువత రోడ్లపైకి వస్తోందని, మీరు ఏమీ చేయక, యువతను చేయనీయకపోతే సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందని పవన్ కల్యాణ్ గత రాత్రి ప్రశ్నించారు.


More Telugu News