: ప్రస్తుత పరిస్థితిలో ఎలాంటి ప్రయోగాలు చేయం: కోహ్లీ

రేపటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ పూణేలో జరగనుంది. లిమిటెడ్ ఓవర్ క్రికెట్ ఫార్మాట్ల కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇది. ఈ నేపథ్యంలో, వన్డే కెప్టెన్ గా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. జట్టులోని సభ్యులంతా మంచి ఫామ్ లో ఉన్నారని... ప్రస్తుత పరిస్థితిలో తాము ఎలాంటి ప్రయోగాలను చేయబోమని ఈ సందర్భంగా కోహ్లీ చెప్పాడు. టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ ను టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగిస్తామని కోహ్లీ చెప్పాడు. మరోవైపు, కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ధోనీ, వన్డేల్లోకి పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్ లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 

More Telugu News