: ఎల్లంపల్లి ప్రధాన పైప్‌లైన్ ప‌గిలి.. 40 మీటర్ల మేర ఎగిసిప‌డుతున్న నీరు

క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి వద్ద ఎల్లంపల్లి ప్రధాన పైప్‌లైన్‌కు ఉన్న గేట్‌వాల్‌ పైపులు పగిలి, ఏకంగా 40 మీటర్ల మేర నీరు పైకి ఎగిసిప‌డుతోంది. ఈ నీరంతా ద‌గ్గ‌ర‌లోని రైతుల భూముల మీదుగా రామడుగు మండలంలోని గుండి గ్రామం చెరువుకు వెళుతోంది. అయిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కూ ప్రాజెక్టు అధికారులు ఎవరూ అటుగా వ‌చ్చి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఉద్ధృతంగా పొంగివ‌స్తోన్న నీరుని స్థానికులు దూరంగా నిల‌బ‌డి చూస్తున్నారు.

More Telugu News