: ‘అమ్మ’ పూర్తిగా కోలుకున్నారు.. ఆసుపత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జి: అన్నాడీఎంకే

తమిళనాడు సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఆసుపత్రి నుంచి త్వరలో డిశ్చార్జి కానున్నారు. జయలలిత పూర్తిగా కోలుకున్నట్లు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారని, ఆమె త్వరలోనే డిశ్చార్జి కానున్నారని అన్నాడీఎంకే పేర్కొంది. కాగా, తీవ్ర అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని అన్నాడీఎంకే నేతలు, నాయకులు, కార్యకర్తలు, ఆమె అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించడం విదితమే.

More Telugu News