: ‘కూంబింగ్ను ఆపాల్సిందే’.. ఏవోబీ ఎన్కౌంటర్కు నిరసనగా విశాఖ కలెక్టరేట్ ముందు ప్రజాసంఘాల ఆందోళన
ఈ నెల 24న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో జరిగిన ఎన్ కౌంటర్పై విశాఖపట్నం కలెక్టరేట్ ముందు ప్రజా సంఘాలు ఈ రోజు ఆందోళనకు దిగాయి. ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్కేతో పాటు మరో 10 మంది పోలీసుల అదుపులోనే ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఏవోబీలో పోలీసులు చేసిన ఎన్కౌంటర్ను వెంటాడి వేటాడి చేసిన దారుణంగా వారు పేర్కొంటున్నారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి ఈ కుట్రను చేశారని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూంబింగ్ను ఆపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.