: అమరావతిలో 75 ఎకరాల భారీ భూకబ్జా?

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో భారీ భూకబ్జా జరుగుతోందా? దీనికి సంబంధించి సాక్షిలో ఓ కథనం వచ్చింది. ఉద్ధండరాయునిపాలెంలోని పెద్దలంకలో 75 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆ కథనంలో సాక్షి పేర్కొంది. 75 ఎకరాల్లో రాత్రికి రాత్రే 50 ఎకరాల్లో కొబ్బరి మొక్కలు నాటారని... మరో 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వారని తెలిపింది. కబ్జాదారులు తమను బెదిరించి మొక్కలు నాటారని స్థానికులు చెప్పినట్టు పేర్కొంది. అయితే, కబ్జాదారులెవరన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News