: ఇథియోపియాలో బందీలైన తెలుగు ప్రొఫెసర్లను కాపాడే యత్నం చేస్తున్నాం: మంత్రి పల్లె రఘునాథరెడ్డి

గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అర్హత ఉన్న ఏజెన్సీలనే ఎంచుకోవాలని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. ఆఫ్రికా దేశమైన ఇథియోపియా దేశంలో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ బందీలైన వారిని విడిపించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ఇదే సమయంలో వైసీపీపై ఆయన మండిపడ్డారు. నారా లోకేష్ ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News