: ఆస్ట్రేలియాలో భారత సంతతి యువతి దుర్మరణం

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతి యువతి ఆషిమా గోయల్ దుర్మరణం చెందింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం, 19 సంవత్సరాల ఆషిమా సిడ్నీలోని వాలాగాంగ్ యూనివర్శిటీలో కామర్స్ కోర్స్ చదువుతోంది. ఆమె కారులో వెళుతుండగా ఒక ట్రక్కు వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆషిమా మృతదేహాన్ని భారత్ కి తరలిస్తున్నట్లు మృతురాలి తండ్రి ప్రవీణ్ గోయల్ కు తెలిపారు.

More Telugu News